కొత్త సంవత్సరం ముందు మోదీ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. ఇక సబ్సిడీలు బంద్.. అసలు కారణం ఇదే!
కొత్త సంవత్సరం ముందు మోదీ సర్కార్ షాకింగ్ ప్రకటన.. ఇక సబ్సిడీలు బంద్.. అసలు విషయం ఇదే! కొత్త సంవత్సరం రావడానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చాలామందిని షాక్కు గురి చేస్తోంది. “ఇక సబ్సిడీలు బంద్” అన్న హెడ్లైన్ చూసి అందరికీ భయం వచ్చినా, అసలు విషయం వేరేలా ఉంది. మొదట క్లియర్గా చెప్పుకోవాలి. ఇది అన్ని సబ్సిడీల గురించి కాదు. రైతులకు, పేదలకు, ఇతర పథకాలకు ఇచ్చే సబ్సిడీలు ఏవీ ఆపలేదు. ఒకే ఒక విభాగానికి సంబంధించిన సబ్సిడీనే కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది అంటా. అదేంటి అంటే… ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలకు ఇచ్చే సబ్సిడీ. ఇప్పటివరకు PM e-Drive పథకం కింద ఎలక్ట్రిక్ ఆటోలు, ఈ–త్రీ వీలర్లకు ప్రభుత్వం డబ్బు సహాయం ఇచ్చేది. కానీ దీని వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనగలిగారు. కాలుష్యం తగ్గాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీమ్ తెచ్చారు అప్పుడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే – “ఈ పథకం కింద పెట్టుకున్న లక్ష్యం పూర్తయ్యింది” అని చెబుతుంది. అంటే, ప్రభుత్వం అనుకున్నంత సంఖ్యలో ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలు ఇప్పటికే ...