TTD కీలక నిర్ణయం.. తిరుమలలో సర్వదర్శనాల రద్దు
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా సర్వదర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులు నిర్దిష్ట తేదీల్లో తిరుమలకు వెళ్లి దర్శనం పొందే అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
టీటీడీ అధికారుల ప్రకారం డిసెంబర్ 30, డిసెంబర్ 31 అలాగే జనవరి 1 తేదీల్లో సర్వదర్శనాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. ఈ మూడు రోజుల్లో కేవలం ఈ-డిప్ విధానం ద్వారా టోకెన్లు పొందిన భక్తులకే స్వామివారి దర్శనం కల్పించనున్నారు. లక్కీడిప్లో ఎంపిక కాని భక్తులు తిరుమలకు రావొద్దని టీటీడీ స్పష్టమైన సూచనలు ఇచ్చింది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశం ఉండటంతో రద్దీ నియంత్రణ, భద్రతా చర్యల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గోవింద మాల ధరించిన భక్తులకు కూడా ఈ తేదీల్లో సర్వదర్శనం అనుమతి ఉండదని వెల్లడించారు.
అయితే జనవరి 2వ తేదీ నుంచి మళ్లీ సాధారణ సర్వదర్శనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు తెలిపాయి. భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక ప్రకటనలను పరిశీలించాలని సూచించారు.
టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం భక్తుల భద్రత కోసమేనని, అనవసరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగానే సమాచారం తెలుసుకుని తిరుమల యాత్రకు సిద్ధం కావాలని అధికారులు కోరుతున్నారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి