పోస్ట్‌లు

బ్రేకింగ్ న్యూస్

విద్యార్థులకు 9 రోజుల సెలవులు – స్కూల్స్ ఎప్పుడు ఓపెన్?”

ఈ ఏడాది తెలంగాణలో చదువుకునే విద్యార్థులకు సంక్రాంతి పండుగ నిజంగానే బాగా కలిసి వచ్చింది. సాధారణంగా సంక్రాంతి సెలవులు అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి కానీ ఈసారి మాత్రం అలా కాదు. ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులతో పాటు ముందు-వెనుక వచ్చే శని, ఆదివారాల వీకెండ్లు కూడా కలవడంతో స్కూల్‌కు కంటిన్యూగా మొత్తం 9 రోజులు సెలవులు వస్తున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వరుసగా రావడం వల్ల విద్యార్థులు ఈసారి తొందరపడకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకునే అవకాశం దక్కింది. ఇంతకుముందులా రెండు మూడు రోజుల్లోనే తిరిగి రావాల్సిన టెన్షన్ లేకపోవడం వల్ల పిల్లలు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. చదువుల ఒత్తిడి మధ్యలో ఈ సెలవులు పిల్లలకు మంచి రిలీఫ్ ఇస్తున్నాయి. స్కూల్ పనులు, హోంవర్క్ ఒత్తిడి నుంచి కొద్దిరోజులు దూరంగా ఉండటం వల్ల మానసికంగా కూడా ఫ్రెష్ అవుతున్నారు. తల్లిదండ్రులకు కూడా ఈ 9 రోజుల సెలవులు చాలా ఉపయోగంగా మారాయి. ప్రయాణాల ప్లానింగ్ సులభమైంది, రద్దీ తగ్గింది, ఖర్చులు కూడా కొంతవరకు కంట్రోల్ అయ్యాయి. గ్రామాలకు వెళ్లే కుటుంబాలకు ఇది చాలా అనుకూలంగా ఉంది. ఈసారి పిల్లలు పండుగ సంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం కూడా వ...

కరెంట్ కట్ అయితే నిమిషాల్లో పొలాల వద్దకే విద్యుత్ అంబులెన్స్‌లు

 తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరో  శుభవార్త చెప్పింది. ఇకపై పొలాల్లో కరెంట్ కట్, ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతినడం, వైర్లు తెగిపోవడం వంటి విద్యుత్ సమస్యలు ఎదురైతే రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదంట ఇకపై. కేవలం ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు… నిమిషాల్లోనే పొలాల వద్దకు విద్యుత్ అంబులెన్స్‌లు వచ్చి సమస్యను పరిష్కరిస్తాయి. విద్యుత్ అంబులెన్స్‌లు అంటే ఏమిటి? విద్యుత్ అంబులెన్స్‌లు అనేవి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలు. వీటిలో అవసరమైన టూల్స్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తు సామగ్రి అనుభవజ్ఞులైన విద్యుత్ సిబ్బంది అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఎక్కడైనా విద్యుత్ సమస్య వచ్చిందంటే వెంటనే అక్కడికి వెళ్లి స్పాట్‌లోనే సమస్యను పరిష్కరించడమే వీటి ప్రధాన లక్ష్యం. రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే? ఇప్పటివరకు చాలా గ్రామాల్లో కరెంట్ సమస్య వస్తే పంటలకు నీళ్లు పెట్టలేకపోవడం మోటార్లు పనిచేయక నష్టం రావడం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కదా. కానీ ఇప్పుడు ఈ విద్యుత్ అంబులెన్స్ సేవలతో రైతుల సమయం ఆదా అవుతుంది. పంటలకు నష్టం తగ్గుతుంది. వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. ఎలా ఫిర్యాద...

సంక్రాంతికి APSRTC గుడ్ న్యూస్.. ప్రయాణికులకు భారీ ఊరట!

 సంక్రాంతి అంటేనే సొంత ఊళ్లకు వెళ్లే సందడి కదా. ప్రతి సంవత్సరం ఈ పండుగ సమయంలో బస్సులు దొరకక, రద్దీతో ప్రజలు ఇబ్బంది పడుతుంటారు ప్రజలు. అయితే ఈసారి ఆ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు. సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.  సంక్రాంతి కోసం ప్రత్యేక బస్సులు సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రత్యేక బస్సులు నడపాలని APSRTC నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాలు, ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రత్యేకంగా ఎక్కడెక్కడ అంటే విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమండ్రి గుంటూరు కర్నూలు వంటి ప్రధాన రూట్లలో ఎక్కువ బస్సులు నడపనున్నారు.  బస్సులు ఎప్పటి నుంచి? సంక్రాంతికి ముందు నుంచే బస్సుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే * సంక్రాంతికి కొన్ని రోజుల ముందే ప్రత్యేక బస్సులు ప్రారంభం * కనుమ తర్వాత కూడా కొన్ని రోజులు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ...

ఏపీ ప్రజలకు శుభవార్త: ఉచితంగా ఇవి తీసుకునే అవకాశం – 9 రోజులే టైమ్!

 రేషన్ కార్డు హోల్డర్లకు ప్రభుత్వం ఉచిత లేదా తగ్గింపు ధరలో ration వస్తువులు అందజేస్తోంది. అందుబాటులో ఉండే ప్రధాన సరుకులు: బియ్యం, రాగులు, జొన్నలు. ఎక్కడ & ఎలా పొందాలి అంటే: ration కార్డుతో ration కేంద్రానికి వెళ్ళి ఉచిత/తగ్గింపు ration పొందండి. నిరుపేద ration కార్డు ఉన్న వారు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించగలరు. ration వస్తువులు పొందడానికి ration card, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ముఖ్య సూచనలు ఈ 9 రోజులలో తప్పక రిజిస్టర్ అవ్వండి, తర్వాత అవకాశం ఉండదు. ration వస్తువులు, పాస్‌బుక్‌ల కోసం కావలసిన పత్రాలు సిద్ధంగా ఉంచండి. పాస్‌బుక్ కోసం భూమి, కుటుంబ వివరాలను సరిగ్గా తీసుకెళ్ళడం మంచిది. గ్రామ అధికారులతో ముందుగా సమీప ration / పాస్‌బుక్ కేంద్రాన్ని సంప్రదించడం సురక్షితం. మొత్తంగా చెప్పాలంటే: పాస్‌బుక్‌లు: ఉచితం, జనవరి 2–9 Ration వస్తువులు: ఉచితం లేదా తగ్గింపు ధర అవసరమైన పత్రాలు: ration card, ఆధార్, భూమి పత్రాలు ఫలితం: సరైన సమయంలో ఈ అవకాశాన్ని ఉపయోగించడం ద్వారా మీ కుటుంబం & రైతు హక్కులు సురక్షితం అవుతాయి. ఇది అయితే ap ప్రజలకు సూపర్ good news అని చెప్పొచ్చు.

కొత్త సంవత్సరం ముందు మోదీ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. ఇక సబ్సిడీలు బంద్.. అసలు కారణం ఇదే!

 కొత్త సంవత్సరం ముందు మోదీ సర్కార్ షాకింగ్ ప్రకటన.. ఇక సబ్సిడీలు బంద్.. అసలు విషయం ఇదే! కొత్త సంవత్సరం రావడానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చాలామందిని షాక్‌కు గురి చేస్తోంది. “ఇక సబ్సిడీలు బంద్” అన్న హెడ్‌లైన్ చూసి అందరికీ భయం వచ్చినా, అసలు విషయం వేరేలా ఉంది. మొదట క్లియర్‌గా చెప్పుకోవాలి. ఇది అన్ని సబ్సిడీల గురించి కాదు. రైతులకు, పేదలకు, ఇతర పథకాలకు ఇచ్చే సబ్సిడీలు ఏవీ ఆపలేదు. ఒకే ఒక విభాగానికి సంబంధించిన సబ్సిడీనే కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది అంటా. అదేంటి అంటే… ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలకు ఇచ్చే సబ్సిడీ. ఇప్పటివరకు PM e-Drive పథకం కింద ఎలక్ట్రిక్ ఆటోలు, ఈ–త్రీ వీలర్లకు ప్రభుత్వం డబ్బు సహాయం ఇచ్చేది. కానీ దీని వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనగలిగారు. కాలుష్యం తగ్గాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీమ్ తెచ్చారు అప్పుడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే – “ఈ పథకం కింద పెట్టుకున్న లక్ష్యం పూర్తయ్యింది” అని చెబుతుంది. అంటే, ప్రభుత్వం అనుకున్నంత సంఖ్యలో ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలు ఇప్పటికే ...

New Year Alert కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న లింక్‌లకు దూరంగా ఉండండి లేదా

 కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు WhatsApp Telegram Facebook SMS లలో Happy New Year మెసేజ్‌లు వీడియోలు లింక్‌లు వరదలా వస్తాయి కదా. అందుకనే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు కూడా యాక్టివ్ అవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల పోలీసులు ఇచ్చిన హెచ్చరిక ప్రకారం కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న కొన్ని లింక్‌లు పూర్తిగా నకిలీవి. వాటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ బ్యాంక్ ఖాతా WhatsApp అకౌంట్‌కు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. Happy New Year Video మీ ఫోటోతో న్యూ ఇయర్ వీడియో రెడీ ఈ లింక్ ఓపెన్ చేయండి సర్ప్రైజ్ ఉంది ఇలాంటి మెసేజ్‌లతో వచ్చే లింక్‌లను క్లిక్ చేస్తే తెలియకుండా మీ ఫోన్‌లో హానికరమైన యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. ఒక్కసారి ఆ యాప్ ఇన్స్టాల్ కాన అయితే మీ ఫోన్‌లోని OTPలు బ్యాంక్ వివరాలు ఫోటోలు కాంటాక్ట్స్ పూర్తిగా హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది. అందుకనే కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ WhatsApp అకౌంట్ కూడా హ్యాక్ అవుతుంది. చాలామంది నాకు బ్యాంక్ యాప్ లేదు బ్యాలెన్స్ లేదు అనుకుంటారు కానీ అసలు సమస్య అక్కడ కాదు. ఒకసారి మీ ఫోన్ కాన హ్యాక్ అయితే మీ WhatsApp నుంచి మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు కూడా అదే లింక్...

ఏపీ కొత్త జిల్లాలు ఖరారు.. గ్రామాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం

చిత్రం
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా స్పష్టమైంది. ప్రజలకు మరింత దగ్గరగా పాలన అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా వ్యవస్థ మరింత సులభంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అయితే, ఈ నోటిఫికేషన్‌పై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఏ గ్రామం ఏ జిల్లాలోకి వస్తుంది ఇప్పుడు, ఏ మండలం ఏ జిల్లాలోకి మారుతుంది అనే అంశాలపై స్పష్టత కావాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే – ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో గ్రామాల పేర్లు, మండలాల వివరాలు, జిల్లా సరిహద్దుల పూర్తి జాబితాను ఇంకా మెన్షన్ చేయలేదు. అంటే, ఇది పూర్తిస్థాయి గ్రామాల వారీ లిస్ట్ కాదు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఇచ్చిన తుది...